మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో మార్చి నెలలో కురిసిన అకాల వర్షాలతో రైతులు నష్టపోయిన సంగతి తెలిసిందే. వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో మార్చి నెలలో కురిసిన వర్షాలు, వడగండ్ల కారణంగా అరటి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో పంట నష్టపోయిన రైతులను వైసీపీ అధినేత వైఎస్ జగన్ పరామర్శించారు. పులివెందుల నియోజకవర్గం లింగాల మండలంలోని అరటి రైతులను అప్పట్లో పరామర్శించిన వైఎస్ జగన్.. వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆర్థిక సాయం ప్రకటించారు.
ఇక ఇచ్చిన మాట ప్రకారం 670 మంది రైతులకు వైఎస్ జగన్ ఆర్థిక సాయం అందించినట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించింది. హెక్టారుకు రూ.20 వేల చొప్పున 670 మంది రైతులకు రూ.1.14 కోట్ల ఆర్థిక సాయాన్ని వైఎస్ జగన్ అందించారని తెలిపింది. అధికారంలో లేకపోయినా అన్నదాతలకు ఇచ్చిన మాటని జగన్ నిలబెట్టుకున్నారని వైసీపీ తెలిపింది. అయితే అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని వైసీపీ విమర్శించింది.
మరోవైపు వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎల్లుండి (మే 13) శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని కల్లితండాలో పర్యటించనున్నారు. ఆపరేషన్ సిందూర్లో అమరుడైన ఆర్మీ జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఈ విషయాన్ని వైసీపీ వెల్లడించింది. మంగళవారం ఉదయం 11.30 గంటలకు శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్ళి తండాలోని వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని జగన్ పరామర్శిస్తారని తెలిపింది. ఆ తర్వాత మధ్యాహ్నం 12.30 గంటలకు తిరిగి బయలుదేరుతారని వెల్లడించింది. మరోవైపు మురళీ నాయక్.కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ ఇప్పటికే ఫోన్లో పరామర్శించారు. మురళీ నాయక్ వీరమరణం పొందిన వార్త తెలియగానే.. అతని కుటుంబసభ్యులను ఫోన్లో పరామర్శించిన వైఎస్ జగన్.. మురళీ నాయక్ కుటుంబానికి ధైర్యం చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa