పాకిస్థాన్ ఉన్మాదులు ఉగ్రవాదంతో భారతదేశాన్ని బయపెట్టాలని చూస్తే.. తమ దేశంలో బయపడేవాళ్లు ఎవరూ లేరని.. తిరిగి గట్టిగా సమాధానం చెబుతామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్ది స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. భారతదేశ మహిళల సిందూరాన్ని చేరిపేయడానికి పాకిస్థాన్ చేసిన తాత్కాలిక ఆనందాన్ని శాశ్వత దు:ఖంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ మార్చారని తెలిపారు. పాకిస్తాన్ భారతదేశంతో ఎన్నో యుద్దాలు చేసిందని.. కానీ ఒక్కటి కూడా గెలవలేక పోయిందని చెప్పారు. అయినా కూడా పాకిస్తాన్కు ఇంకా బుద్ది రావడం లేదని మండిపడ్డారు. కేవలం మూడు రోజుల్లోనే భారతదేశ పౌరుషాన్ని పాకిస్తాన్కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ చూపించారని చెప్పారు. పాకిస్థాన్పై భారతదేశం పూర్తి స్థాయి యుద్ధం ప్రకటిస్తే ఒక్క రాత్రిలో ప్రపంచపటం నుంచి పాకిస్థాన్ తుడిచిపెట్టుకు పోతుందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్ది హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa