కర్నూలులో నేడు (ఆదివారం) కర్నూలు నియోజకవర్గంలోని ఓ హోటల్లో మినీ మహానాడు జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకెపోగు ప్రభాకర్, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ...... టీడీపీ నాయకులు, కార్యకర్తలకు ఓర్పు అవసరమని మంత్రి టీజీ భరత్ అన్నారు. 2019 ఎన్నికల ముందు ఓ నాయకుడిని మంత్రి నారా లోకేష్ అభ్యర్థిగా ప్రకటించారని... అయినప్పటికీ ఓర్పుగా ఉన్నానని... చివరకు తనకే టికెట్ వచ్చిందని మంత్రి టీజీ భరత్ గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వంలో శరవేగంగా కర్నూలు జిల్లా అభివృద్ధి చెందుతుందని మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో మరో రెండుసార్లు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa