ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కురబలకోట పరిధిలో రోడ్డు ప్రమాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 21, 2025, 02:01 PM

కురబలకోట పరిధిలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో  మదనపల్లెకు చెందిన సురేంద్ర, అనసూయ దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. ములకలచెరువులోని బంధువుల పెళ్లికి బైక్ పై దంపతులు బయల్దేరారు. ఈ క్రమంలో కురబలకోట మండలం కంటేవారిపల్లె వద్దకు రాగానే వీరి బైక్ కు కుక్క అడ్డు రావడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. వారిని మదనపల్లె ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa