భారత క్రికెట్ జట్టు సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కు దూరమవుతున్నారన్న వార్తలపై యువరాజ్ సింగ్ తండ్రి, మాజీ కోచ్ యోగరాజ్ సింగ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భారత రెడ్-బాల్ క్రికెట్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారిద్దరూ తమ నిర్ణయాలను పునఃపరిశీలించుకోవాలని ఆయన గట్టిగా కోరారు. త్వరలో ఇంగ్లండ్తో జరగనున్న కీలకమైన ఐదు టెస్టుల సిరీస్కు ముందు, జట్టుకు వారిద్దరి అనుభవం చాలా అవసరమని యోగరాజ్ అభిప్రాయపడ్డారు.ఈ ఇద్దరు సీనియర్ బ్యాటర్లు జట్టు నుంచి వైదొలగడం వల్ల, ముఖ్యంగా ఇంగ్లండ్ వంటి పటిష్టమైన జట్టుతో సిరీస్కు ముందు, భారత జట్టులో అనుభవజ్ఞుల కొరత ఏర్పడుతుందని యోగరాజ్ అన్నారు. విరాట్ కోహ్లీలో ఇంకా చాలా సంవత్సరాల క్రికెట్ మిగిలి ఉందని, అతను తన నిర్ణయాన్ని తప్పకుండా మార్చుకోవాలని సూచించారు. "భారత టెస్ట్ క్రికెట్ను కాపాడటానికి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ నుంచి వెనక్కి రావాలి. ఇది తమ గురించి ఆలోచించుకునే సమయం కాదు. దేశం, అభిమానులు, ఆట పట్ల ప్రజలకున్న ప్రగాఢమైన భావోద్వేగాల గురించి ఆలోచించాలి. విరాట్ ఇంకా కనీసం పదేళ్లు ఆడగలడు. ఇక రోహిత్ విషయానికొస్తే, అతను నా దగ్గరకు వస్తే, తిరిగి పూర్తి ఫిట్నెస్ సాధించేలా నేను చూసుకుంటాను" అని యోగరాజ్ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa