ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మయన్మార్‌ లో విషాదం, రెండు పడవలు బోల్తా, 427 మంది మృతి

international |  Suryaa Desk  | Published : Sat, May 24, 2025, 05:40 PM

మయన్మార్‌ తీర ప్రాంతంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. రోహింగ్యా శరణార్థులతో వెళ్తున్న రెండు ఓడలు మునిగిపోయాయి. ఈ ఘోర దుర్ఘటనల్లో సుమారు 427 మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారని ఐక్యరాజ్య సమితి (ఐరాస) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వార్త నిజమైతే, ఇటీవలి కాలంలో సముద్రంలో జరిగిన అతి పెద్ద విషాదాల్లో ఒకటిగా ఇది నిలిచిపోతుందని ఐరాస పేర్కొంది.ఐక్యరాజ్య సమితి అందించిన ప్రాథమిక సమాచారం ప్రకారం, మే 9వ తేదీన జరిగిన మొదటి ప్రమాదంలో ఒక నౌక మునిగిపోయింది. ఇందులో ప్రయాణిస్తున్న 267 మందిలో కేవలం 66 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడి ఉంటారని తెలిపింది. మిగిలిన వారు గల్లంతయ్యారు.ఆ తర్వాత మే 10వ తేదీన మరో నౌక కూడా ఇదే విధంగా ప్రమాదానికి గురైంది. ఈ రెండో నౌకలో ఉన్న వారిలో 21 మంది మాత్రమే సురక్షితంగా ఒడ్డుకు చేరారని సమాచారం. ఈ రెండు ఘటనల్లో కలిపి మొత్తం 427 మంది మరణించి ఉండవచ్చని ఐరాస అంచనా వేస్తోంది. ఈ ప్రమాదాలకు గల కచ్చితమైన కారణాలపై ఐరాసకు అనుబంధంగా పనిచేస్తున్న శరణార్థి విభాగం విశ్లేషణ జరుపుతున్నట్లు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa