ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 27, 2025, 01:27 PM

విద్యుత్తు సేవలపై ప్రజల్లో సంతృప్తి స్థాయి పెరగాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్‌ అన్నారు. సమస్యలను పరిష్కరించడంలో చరుకుగా వ్యవహరించడం లేదన్న ఫిర్యాదులపై కఠినంగా వ్యవహరిస్తామని ఆయన స్పష్టం చేశారు. సోమవారం వెలగపూడి సచివాలయంలో రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ సొసైటీ(ఆర్టీజీస్‌) కార్యాలయంలో డిస్కమ్‌ల సీఎండీలతో వర్చువల్‌ రివ్యూ సమావేశాన్ని ఆయన నిర్వహించారు. ‘రియల్‌ టైమ్‌లో సమస్యలు పరిష్కారమవ్వాలి. విద్యుత్తు సరఫరాలో ఎలాంటి అవాంతరాలు ఎదురుగాకుండా చూడాలి. గ్రామీణ ప్రాంతాల్లో లోవోల్టేజీ సమస్య, పట్టణ ప్రాంతాల్లో కరెంటు కోతలు, ట్రాన్స్‌ఫార్మర్ల సమస్యలు లేకుండా చూడాలి. ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చిన వెంటనే పరిష్కరించాలి. అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు. విద్యుత్తు సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ, నిరంతరం సేవలందించాలి’ అని సీఎస్‌ స్పష్టం చేశారు. ఈ సమీక్షలో ఈపీడీసీఎల్‌ సీఎండీ పృధ్వీతేజ్‌, ఎస్పీడీసీఎల్‌ సీఎండీ కె.సంతోషరావు, సీపీడీసీఎల్‌ సీఎండీ పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa