ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో బుధవారం వరుస భూకంపాలు సంభవించాయి

national |  Suryaa Desk  | Published : Wed, May 28, 2025, 08:16 PM

ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో బుధవారం వరుస భూకంపాలు సంభవించాయి. స్వల్ప వ్యవధిలో మూడుసార్లు భూమి కంపించడంతో ప్రజలు కొంత ఆందోళనకు గురయ్యారుజాతీయ భూకంప అధ్యయన కేంద్రం నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపిన వివరాల ప్రకారం, బుధవారం తెల్లవారుజామున 1:54 గంటలకు చురాచాంద్‌పూర్ జిల్లాలో మొదటి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.2గా నమోదైంది. ఇది ఈరోజు సంభవించిన భూకంపాల్లోకెల్లా శక్తివంతమైనది.ఆ తర్వాత, తెల్లవారుజామున 2:26 గంటలకు నోనెయ్ జిల్లాలో రెండోసారి భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 2.5గా నమోదైంది. అనంతరం, ఉదయం 10:23 గంటలకు చురాచాంద్‌పూర్ జిల్లాలో మరోసారి భూమి కంపించింది. ఈసారి భూకంప తీవ్రత 3.9గా నమోదైందని జాతీయ భూకంప అధ్యయన కేంద్రం పేర్కొంది.వరుస భూ ప్రకంపనల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షించారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం, ఈ భూకంపాల వల్ల ఎక్కడా ఎలాంటి ప్రాణ నష్టం గానీ, ఆస్తులకు నష్టం వాటిల్లినట్లుగానీ నివేదికలు అందలేదని అధికారులు స్పష్టం చేశారు. దీంతో స్థానిక ప్రజలు, అధికార యంత్రాంగం ఊరట చెందారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa