ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో బుధవారం వరుస భూకంపాలు సంభవించాయి. స్వల్ప వ్యవధిలో మూడుసార్లు భూమి కంపించడంతో ప్రజలు కొంత ఆందోళనకు గురయ్యారుజాతీయ భూకంప అధ్యయన కేంద్రం నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపిన వివరాల ప్రకారం, బుధవారం తెల్లవారుజామున 1:54 గంటలకు చురాచాంద్పూర్ జిల్లాలో మొదటి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.2గా నమోదైంది. ఇది ఈరోజు సంభవించిన భూకంపాల్లోకెల్లా శక్తివంతమైనది.ఆ తర్వాత, తెల్లవారుజామున 2:26 గంటలకు నోనెయ్ జిల్లాలో రెండోసారి భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 2.5గా నమోదైంది. అనంతరం, ఉదయం 10:23 గంటలకు చురాచాంద్పూర్ జిల్లాలో మరోసారి భూమి కంపించింది. ఈసారి భూకంప తీవ్రత 3.9గా నమోదైందని జాతీయ భూకంప అధ్యయన కేంద్రం పేర్కొంది.వరుస భూ ప్రకంపనల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షించారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం, ఈ భూకంపాల వల్ల ఎక్కడా ఎలాంటి ప్రాణ నష్టం గానీ, ఆస్తులకు నష్టం వాటిల్లినట్లుగానీ నివేదికలు అందలేదని అధికారులు స్పష్టం చేశారు. దీంతో స్థానిక ప్రజలు, అధికార యంత్రాంగం ఊరట చెందారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa