ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యుత్ షాక్‌తో ఆరేళ్ల చిన్నారి మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 30, 2025, 03:37 PM

కర్నూలు జిల్లా, పెద్ద కడబూరు మండలం, బసలదొడ్డి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. విద్యుదాఘాతం కారణంగా ఆరేళ్ల చిన్నారి వేదవతి (6) మృతి చెందింది. ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో ఎర్త్‌ వైర్ తగలడంతో ఈ దుర్ఘటన జరిగింది. 
మృత చిన్నారి వేదవతి, టీడీపీ మండల కన్వీనర్‌ ఈరన్న మనవరాలు. కడపలో మహానాడులో ఉన్న ఈరన్నకు సమాచారం అందడంతో ఆయన స్వగ్రామానికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. చిన్నారి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa