ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ షాపుల ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. అందులో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో రేషన్ పంపిణీని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ షాపుల ద్వారా సరుకులు పంపిణీ చేస్తామన్నారు.ఉదయం 8-12, సాయంత్రం 4-8 గంటల వరకు రేషన్ షాపులు పని చేస్తాయని చెప్పారు. ఈ 15 రోజుల్లో అవకాశం ఉన్న సమయాల్లో రేషన్ తీసుకునే వెసులుబాటును ప్రజలకు కల్పించామని తెలిపారు. అలాగే 65 యేళ్లు పైబడిన వారికి, దివ్యాంగులకు వారి వారి ఇళ్ల వద్దకే వెళ్లి రేషన్ ఇచ్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసినట్లు ఆయన వివరించారు. అర్హులైన వారికి ప్రభుత్వం బియ్యాన్ని పూర్తిగా ఉచితంగా అందజేయనుంది.ఈ నెలలోని తొలి 15 రోజుల్లో శెలవు దినాల్లో సైతం అంటే.. ఆదివారం కూడా రేషన్ షాపుల్లో నిత్యవసర వస్తువులను పంపిణీ చేయనున్నారు. అలాగే లబ్దిదారులు.. ఎక్కడ రేషన్ కార్డు ఉంటే అక్కడికే వెళ్లి నిత్యవసర వస్తువులను తీసుకోనవసరం లేదు. సమీపంలోని రేషన్ షాపుల్లో సైతం వాటిని తీసుకునే సౌలభ్యాన్ని ప్రభుత్వం కల్పించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa