సిక్కింలో భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటంతో లాచుంగ్ తదితర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన తెలుగు కుటుంబాలను సురక్షితంగా స్వస్థలాలకు తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగంగా స్పందించింది. ఈ మేరకు తక్షణ చర్యలు చేపట్టినట్లు నేడు ఓ ప్రకటనలో వెల్లడించింది.కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు నేతృత్వంలో, వారిని సత్వరమే తరలించడానికి ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ రెసిడెంట్ కమిషనర్ కార్యాలయం తెలిపింది. బాధితుల్లో విజయనగరం తహసీల్దార్ కూర్మనాథరావు కూడా ఉన్నారు. ఆయన తన కుటుంబంతో సహా గత మూడు రోజులుగా లాచుంగ్లో చిక్కుకుపోయారు. ఆయన కుటుంబ సభ్యులు ఎం. ఉమ (38), దీక్షిత (15), జయాంశ్ నారాయణ (6) ఉన్నట్లు సమాచారం. వారి భద్రతకు తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు రెసిడెంట్ కమిషనర్ పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa