దేశంలో వ్యవసాయ ఉత్పత్తులకు సరైన మద్దతు ధరలు లేకపోవడం రైతులను తీవ్రంగా దెబ్బతీయడం కొనసాగుతోంది. నిన్న ఆంధ్రప్రదేశ్లో నిమ్మకాయల ధర కేజీకి రూ.15కు పడిపోవడంతో రైతులు నిరసనకు దిగిన సంగతి తెలిసిందే. ఇదే తరహాలో ఇవాళ కర్ణాటకలోని విజయపురాలో ఉల్లిపాయల ధర అమాంతం పడిపోవడం రైతు ఆవేదనకు దారితీసింది.
స్థానిక మార్కెట్లో క్వింటాల్కు కనీసం రూ.800-1000 పలుకుతుందని ఆశించిన రైతుకు కేవలం రూ.200 మాత్రమే లభించడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. తన కష్టంతో పండించిన ఉల్లిపాయలకు ఈ స్థాయిలో తక్కువ ధర లభించడాన్ని తట్టుకోలేకపోయిన ఆ రైతు — నడిరోడ్డుపై ఉల్లిపాయలను పారబోసి, వాటిపై దొర్లుతూ వినూత్నంగా నిరసన తెలియజేశాడు.
ఈ సంఘటనను చూసిన పాసర్లూ, స్థానికులు దిగ్బ్రాంతికి గురయ్యారు. ఆ రైతు కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. “మా కష్టాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. మద్దతు ధర లేక రైతన్న బతుకే ఇబ్బంది అయింది,” అంటూ ఆ రైతు వేదన వ్యక్తం చేశాడు.
ఈ సంఘటన ప్రభుత్వ యంత్రాంగానికి గమనించాల్సిన ఘట్టంగా మారింది. రైతులు పండించే పంటలకు కనీస మద్దతు ధర నిర్ధారించడంలో తక్షణ చర్యలు తీసుకోవాలని వ్యవసాయ నిపుణులు, సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa