ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది

national |  Suryaa Desk  | Published : Thu, Jun 05, 2025, 05:08 PM

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు విజయోత్సవాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన ఈ సంబరాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. అభిమానులు ఒక్కసారిగా స్టేడియంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగి, పది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో యాభై మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ దురదృష్టకర సంఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.ఈ తొక్కిసలాట ఘటనపై రాష్ట్రంలోని సిద్ధరామయ్య ప్రభుత్వంపై ప్రతిపక్ష బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ప్రభుత్వ నిర్లక్ష్యం, సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే ఈ ఘోరం జరిగిందని ఆరోపించింది. "ప్రజలకు భద్రత కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ముందస్తు ప్రణాళిక లేకుండా కార్యక్రమాన్ని నిర్వహించారు. అందుకే ఈ దారుణం జరిగింది. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి" అని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పలువురు క్రీడా, రాజకీయ ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.వివరాల్లోకి వెళితే, ఆర్సీబీ విజయాన్ని పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో అభిమానులు చిన్నస్వామి స్టేడియం వద్దకు చేరుకున్నారు. వేడుకల్లో భాగంగా స్టేడియంలోకి వెళ్లేందుకు గేటు-2 వద్ద అభిమానులు ఒక్కసారిగా తోసుకురావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది. అదే సమయంలో తీవ్రమైన తోపులాట జరగడంతో తొక్కిసలాటకు దారితీసింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa