ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వేధింపులు భరించలేక వైసీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 07, 2025, 10:35 AM

పల్నాడు  జిల్లాలో టీడీపీ నాయకులు, పోలీసుల వేధింపులు భరించలేక లక్ష్మీ నారాయణ అనే వైయ‌స్ఆర్‌సీపీ  కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. లక్ష్మీనారాయణకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఆత్మహత్యాయత్నం సమయంలో సెల్పీ వీడియో రిలీజ్‌ చేశాడు లక్ష్మీనారాయణ,. ఆ వీడియోలో టీడీపీ ప్రభుత్వం, పోలీసుల అరాచకాలపై ఆవేదన వ్యక్తపరిచారు. ఈ పోలీసుల అరాచకాలకు చెక్‌ పెట్టాలి. వైయ‌స్ఆర్‌సీపీ  అంటేనే ప్రభుత్వం పెద్దల అండతో పోలీసులు టార్చర్‌ పెడుతున్నారు. నాలాగా మరొకరు బలి కాకూడద’ అని పేర్కొని ఆత్మహత్యాయత్నం చేశాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa