కర్ణాటక రాజధాని బెంగుళూరు నగర శివార్లలోని ఓ హోటల్ గదిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ టెక్కీ తన ప్రియురాలిని అత్యంత కిరాతకంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. కెంగేరి ప్రాంతంలోని పూర్ణ ప్రజ్ఞ లేఅవుట్లో శుక్రవారం రాత్రి ఈ దారుణం జరిగింది. అయితే, రెండు రోజుల తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.మృతురాలిని ఇద్దరు పిల్లల తల్లి హరిణి(33)గా గుర్తించారు. ఆమె కెంగేరిలోనే నివాసముంటున్న తన ప్రియుడు, టెక్కీ అయిన యశస్ (25)తో కలిసి హత్య జరగడానికి రెండు రోజుల ముందు ఓయో హోటల్లో రూమ్ తీసుకున్నారు. శుక్రవారం రాత్రి వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన యశస్, హరిణిపై కత్తితో దాడి చేశాడు. ఏకంగా 17 సార్లు పొడిచినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడిలో హరిణి అక్కడికక్కడే మృతి చెందింది.వ్యక్తిగత కారణాలు, వారి మధ్య ఉన్న సంబంధంలోని సమస్యలే ఈ హత్యకు దారి తీసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, ఈ విషయాలపై పూర్తి వివరాలు అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. కాగా, ఘటన జరిగిన రెండు రోజుల వరకు హత్య విషయం బయటకు రాకపోవడం గమనార్హం. దీంతో హోటల్ భద్రతాపరమైన లోపాలు, హత్యకు దారితీసిన పరిస్థితులపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఈ దారుణ ఘటనపై సుబ్రమణ్యపుర పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ముమ్మరం చేశారు. సాక్ష్యాధారాలను సేకరిస్తున్నామని, అసలు ఏం జరిగిందనే దానిపై పూర్తి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa