ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రంలో ఆడపిల్ల ఒంటరిగా వెళ్లాలంటే భయపడే పాలన కొనసాగుతుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 09, 2025, 06:47 PM

ఇంటర్ విద్యార్థి తన్మయి దారుణహత్య తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని మాజీ ఎమ్మెల్యే అనంత వెంక‌ట్రామిరెడ్డి అన్నారు. ఈనెల 3వ తేదీన తన్మయి అదృశ్యమైతే పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేద‌ని ఆయ‌న ప్రశ్నించారు. అనంతపురం జిల్లాలో గత ఏడాది కాలంలో 72 మంది అమ్మాయిలు అదృశ్యం అయ్యార‌ని, పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే తన్మయి హత్య జరిగుండేది కాద‌న్నారు. ఏపీలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఆడపిల్ల ఒంటరిగా వెళ్లాలంటే భయపడే రోజులు దాపురించాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాంతి భద్రతలను గాలికొదిలేశార‌ని, ల్యాండ్ సెటిల్మెంట్ లలో పోలీసులు బిజీ గా ఉన్నారని ఆరోపించారు. ప్ర‌జల భద్రతను గాలికొదిలేశార‌ని, ఎస్పీ నుంచి డీజీపీ దాకా లా అండ్ ఆర్డర్ పై రివ్యూ చేయడం లేద‌ని ఆక్షేపించారు. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై కక్ష సాధింపు చర్యలకు మాత్రమే పోలీసులు పనిచేస్తున్నార‌ని అనంత వెంకటరామిరెడ్డి ఫైర్ అయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa