రిషబ్ పంత్ షాట్ ఆడితే అది ఎటెళ్తుందో ఎవ్వరికీ తెలియదు. ముందు కొచ్చి బ్యాట్ ఊపాడంటూ అయితే బాల్ అయినా పోవాలి, లేకపోతే బ్యాట్ అయినా పోవాలి. వరల్డ్ క్రేజియెస్ట్ బ్యాటర్లలో రిషబ్ పంత్ ఒకడు. ఇంగ్లండ్తో సిరీస్కు ముందే ఆ జట్టును పంత్ భయపెట్టేశాడు. టెస్టు సిరీస్ కోసం శనివారం ఇంగ్లండ్ చేరుకున్న టీమిండియా.. సోమవారం నుంచి ప్రాక్టీస్ మొదలుపెట్టింది.
ఇంగ్లండ్ సిరీస్ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీమిండియా గ్రౌండ్లో ముమ్మర ప్రాక్టీస్ మొదలుపెట్టింది. నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో రిషబ్ పంత్ భారీ షాట్స్ ఆడాడు. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో మిడాన్ మీదుగా సిక్సర్ బాదడంతో అది నేరుగా స్టేడియం పైకప్పు తగిలింది. వెంటనే అది పగిలిపోయింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
రిషబ్ పంత్ టెస్టును కూడా టీ20 ఆడినట్టే ఆడుతాడు. పంత్ క్రీజులోకి వచ్చాడంటూ స్కో బోర్డ్ పెరగాల్సిందే. బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో కూడా ఇలా షాట్స్ ఆడి అప్పట్లో సునీల్ గావస్కర్తో తిట్టించుకున్నాడు. మరి ఈ సారయినా రిషబ్ పంత్ బ్యాటింగ్ తీరు మారుతుందో లేక అదే రకమైన షాట్స్తో రెచ్చిపోతాడా వేచి చూడాలి.
ఇంగ్లండ్-ఇండియా మధ్య జూన్ 20 నుంచి టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీ మొదలవ్వనుంది. మొత్తం ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో యువ జట్టుతో టీమిండియా బరిలోకి దిగుతోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత టీమిండియా ఆడనున్న తొలి సిరీస్ ఇది. శుభమన్ గిల్ కెప్టెన్సీ యువ ఆటగాళ్లను బీసీసీఐ సెలెక్ట్ చేయడం విశేషం. బుమ్రా, సిరాజ్ వంటి అనుభవమైన బౌలర్లు కూడా ఉన్నారు. ఈ సిరీస్లో టీమిండియా బ్యాటింగ్ భారమంతా కేఎల్ రాహుల్పై పడే అవకాశం ఉంది. కరుణ్ నాయర్ కూడా ఫామ్లో ఉండటం టీమిండియాకు కలిసొచ్చే అంశం. జూన్ 20 నుంచి ఆగస్టు 4 వరకు మొత్తం ఐదు టెస్టులు జరగనున్నాయి. ఈ టెస్టు సిరీస్తోనే వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27 మొదలవ్వనుంది. దాంతో ఈ టెస్టు సిరీస్ అటు ఇంగ్లండ్, ఇటు భారత్కు చాలా కీలకంగా మారనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa