ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని వైయస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి స్పష్టం చేశారు. నరసరావుపేటలోని క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఏడాది కాలంగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తుంటే తట్టుకోలేక వైయస్ఆర్సీపీ నేతలను తప్పుడు కేసులతో భయపెట్టాలని కూటమి ప్రభుత్వం చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మెడలు వంచైనా సరే ప్రజలకు హామీ ఇచ్చిన ప్రతి పథకాన్ని అమలు చేసేలా చేసే బాధ్యత ప్రతిపక్షంగా వైయస్ఆర్సీపీపై ఉందని అన్నారు. అయన మాట్లాడుతూ.... చంద్రబాబు పాలన ఎమర్జెన్సీని తలపించేలా ఉంది. రాయలసీమ, పల్నాడులో ఒకప్పుడున్న ఫ్యాక్షనిజం ఇప్పుడు చంద్రబాబు పాలనలోనూ కనిపిస్తోంది. ప్రతిపక్ష నేత మీద అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలన్న ఆరాటం తప్పించి ప్రజా సంక్షేమం, సుపరిపాలన చేయాలన్న ఆలోచన సీఎం చంద్రబాబుకి లేదు. ఎన్నికల్లో ఓడిపోయాక తిరిగి పుంజుకోవడానికి చంద్రబాబుకి రెండున్నరేళ్లు పట్టింది, కేసీఆర్ కి ఏడాదిన్నర పట్టింది. కానీ జగన్ మాత్రం ఆరు నెలల్లోనే ప్రజా పోరాటాలను ఉధృతం చేస్తున్నాడని చంద్రబాబుకి అత్యంత ఆప్తుడు ఆర్కే ఏబీయన్ వీకెండ్ కామెంట్లోనే చెప్పాడు. ఓడిపోయినా జగన్ లో ఆ కుంగుబాటు లేదేంటనే బాధ కూటమి నేతల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఓడిపోతే ఎందుకు ఆగిపోవాలి? నేటి ఓటమే రేపటి గెలుపునకు నాంది కావాలని నమ్మిన వ్యక్తి వైయస్ జగన్. అందుకే రైతులు, యువత, విద్యార్థులు, మహిళల పక్షాన నిలబడి పోరాడుతున్నారు అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa