ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లా విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటనపై స్పందించిన మదన్ మిత్రా

national |  Suryaa Desk  | Published : Sun, Jun 29, 2025, 02:09 PM

కోల్‌కతాలో లా విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుండగా, పశ్చిమ బెంగాల్ అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సీనియర్ నేత మదన్ మిత్రా కీలక వ్యాఖ్యలు చేసారు. బాధితురాలినే తప్పుపట్టేలా మాట్లాడటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.ఈ ఘటనపై నిన్న మదన్ మిత్ర మాట్లాడుతూ..  విద్యార్థి సంఘంలో పదవి ఇస్తామని ఎవరైనా పిలిస్తే, కాలేజీ మూసి ఉన్నప్పుడు అమ్మాయిలు వెళ్లకూడదని ఈ ఘటన ఒక సందేశం ఇచ్చిందని పేర్కొన్నారు. ఆ అమ్మాయి అక్కడికి వెళ్లకుండా ఉండి ఉంటే ఈ దారుణం జరిగేది కాదని వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా, "వెళ్లే ముందు ఆమె ఎవరికైనా సమాచారం ఇచ్చి ఉన్నా లేదా తనతో పాటు ఇద్దరు స్నేహితులను తీసుకెళ్లినా ఈ అఘాయిత్యం జరిగి ఉండేది కాదు. పరిస్థితిని అదునుగా తీసుకుని నిందితుడు ఈ నీచమైన పనికి పాల్పడ్డాడు" అని ఆయన పేర్కొన్నారు.ఈ కేసులో ప్రధాన నిందితుడైన మనోజిత్ మిశ్రాకు టీఎంసీ విద్యార్థి విభాగం (టీఎంసీపీ)తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలను మదన్ మిత్రా తోసిపుచ్చారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa