ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వల్లభనేని వంశీకి బెయిల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 01, 2025, 07:16 PM

 వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మంగళవారం బెయిల్ మంజూరైంది. ఇప్పటి వరకు వంశీపై నమోదైన అన్ని కేసుల్లోనూ నూజివీడు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో వంశీ బుధవారం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గతంలో వంశీపై ఉన్న కేసులను రీ ఓపెన్ చేసి జైలుకు పంపిన సంగతి తెలిసిందే.వివరాల్లోకి వెళితే, ఏలూరు జిల్లా నూజివీడు కోర్టులో నమోదైన నకిలీ ఇళ్ల పట్టాల కేసుకు సంబంధించి ఈరోజు నూజివీడు కోర్టు వంశీకి బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల విలువైన రెండు పూచీకత్తులు సమర్పించాలని, వారానికి రెండుసార్లు సంబంధిత పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాలని న్యాయస్థానం షరతులు విధించింది. ఈ కేసుతో కలిపి తనపై నమోదైన మొత్తం 10 కేసుల్లోనూ వంశీకి బెయిల్ లభించినట్లయింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదల కావడం ఖాయమని ఆయన వర్గీయులు భావించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa