రాజకీయాలు, కులమతాలకి అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ తమ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ(గురువారం) నెల్లూరు జిల్లాలోని చేజర్లలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో మంత్రి ఆనం పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ ఏడాది కూటమి ప్రభుత్వ పాలనలో చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి గురించి ప్రజలకి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. సూపర్ 6 హామీలను వరుసగా అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇప్పటికే ఎన్టీఆర్ పెన్షన్లు, దీపం పథకం, తల్లికివందనం అమలు చేశామని వెల్లడించారు. ఈ నెలలో అన్నదాత సుఖీభవ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయబోతున్నామని ప్రకటించారు. ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే ఆడబిడ్డ నిధి అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉద్ఘాటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa