లిక్కర్ కేసులో అరెస్టయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మూడో రోజు విచారణ నిమిత్తం సిట్ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. అయితే, జైలు నుంచి ఆయన్ను విచారణకు తరలిస్తున్న సమయంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. "నేను ఏ తప్పు చేయలేదు, నాపై తప్పుడు కేసులు పెట్టారు" అంటూ చెవిరెడ్డి గట్టిగా అరిచారు.వివరాల్లోకి వెళితే, లిక్కర్ కేసుకు సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు వెంకటేష్ నాయుడిని కూడా సిట్ అధికారులు గురువారం కస్టడీకి తీసుకుని ప్రశ్నించనున్నారు. ఈ క్రమంలో వారిని జైలు నుంచి బయటకు తీసుకువస్తుండగా, చెవిరెడ్డి ఒక్కసారిగా తాను నిర్దోషినంటూ నినాదాలు చేశారు. తనను ఈ కేసులో అన్యాయంగా ఇరికించారని ఆయన ఆరోపించారు.ఇదిలా ఉండగా, గడిచిన రెండు రోజుల విచారణలో చెవిరెడ్డి నుంచి సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు ఆయన దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మూడో రోజు విచారణ కీలకంగా మారింది. కేసులో కీలక సమాచారం రాబట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa