ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆగస్టులో జరగాల్సిన భారత్-బంగ్లాదేశ్ సిరీస్‌పై సందిగ్ధత

sports |  Suryaa Desk  | Published : Thu, Jul 03, 2025, 04:28 PM

ఆగస్టు నెలలో జరగాల్సి ఉన్న భారత క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ పర్యటనపై నీలినీడలు కమ్ముకున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఇరు జట్ల మధ్య మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ జరగాల్సి ఉండగా, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పర్యటనకు భారత ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తుందా లేదా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు  అధ్యక్షుడు అనిముల్ ఇస్లాం కీలక వ్యాఖ్యలు చేశారు. భారత జట్టుకు ఆతిథ్యం ఇచ్చేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు.బీసీసీఐతో తమకు ఎప్పుడూ సానుకూల చర్చలే జరుగుతాయని అనిముల్ ఇస్లాం తెలిపారు. "ఒకవేళ వచ్చే నెలలో భారత జట్టు పర్యటన సాధ్యం కాకపోతే, సిరీస్‌ను ఎలా నిర్వహించాలనే దానిపై చర్చిస్తాం. ఇప్పుడు కుదరకపోయినా, భవిష్యత్తులో మరోసారి ఆతిథ్యం ఇచ్చేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. భారత ప్రభుత్వ క్లియరెన్స్ లభించిన తర్వాతే బీసీసీఐ తుది నిర్ణయం తీసుకుంటుంది" అని ఆయన వివరించారు. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఐదు టెస్టుల సిరీస్ ఆడుతున్న టీమిండియా పర్యటన ఆగస్టు 5న ముగియనుంది. ఆ తర్వాతే బంగ్లా సిరీస్‌పై స్పష్టత రానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa