ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో స్కూల్ విద్యార్థులకు నెలకు రూ.600

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 03, 2025, 06:10 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూల్ విద్యార్థులకు తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు దూరంగా వెళ్లే విద్యార్థులకు ప్రభుత్వం రవాణా ఛార్జీలు చెల్లించనుంది. 2025-26 విద్యా సంవత్సరానికి కేంద్రం రూ.47.91 కోట్లు మంజూరు చేయగా.. ఈ డబ్బుల్ని విద్యార్థుల తల్లిదండ్రుల అకౌంట్‌లలో జమ చేస్తారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పాఠశాల విద్యాశాఖ సంస్కరణల్లో భాగంగా పాఠశాలల హేతుబద్ధీకరణ చేసింది.. ఈ క్రమంలో కొన్ని ప్రభుత్వ బడులు దూరమయ్యాయి. 1 నుంచి 8 తరగతుల విద్యార్థులకు విద్యాహక్కు చట్టం ప్రకారం స్కూల్ ఒక నిర్ణీత దూరంలో ఉండాలి. ఒకవేళ ప్రభుత్వ బడి దూరంగా ఉంటే కనుక విద్యార్థులు వెల్లేందుకు, వచ్చేందుకు అవసరమయ్యే రవాణా ఛార్జీలన ప్రభుత్వం చెల్లించాలి. అయితే స్కూల్ విద్యార్థులకు అందించే ఈ రవాణా ఛార్జీలలో కేంద్రం 60శాతం.. రాష్ట్ర ప్రభుత్వం 40శాతం కలిపి ఇస్తారు.


ఈ విద్యా సంవత్సరంలో ప్రతి మూడు నెలలకోసారి విద్యార్థులకు అందజేసే ఈ రవాణా ఛార్జీలను తల్లిదండ్రుల బ్యాంకు అకౌంట్‌లలో జమ చేయాలని భావిస్తున్నామని చెప్పారు సమగ్ర శిక్షాభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ బి. శ్రీనివాసరావు. ఈ డబ్బుల్ని విడతల వారీగా అందజేస్తారు. ఏపీ విద్యాశాఖ ఈ విద్యా సంవత్సరంలో కొన్ని కీలక సంస్కరణలు తీసుకొచ్చింది.. 9 రకాల స్కూళ్లను తీసుకొచ్చింది. రాష్ట్రంలో మొత్తం 9వేల600 ఆదర్శ ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేయగా.. ఈ క్రమంలో దగ్గరలో ఉన్న మూడు, నాలుగు, ఐదు తరగతుల్ని ఆదర్శ ప్రాథమిక పాఠశాలలుగా మార్చింది ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో ప్రభుత్వం.. ఈ ప్రాథమికోన్నత బడుల స్థాయిని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 6, 7, 8 తరగతుల విద్యార్థులు దగ్గరలోని ఉన్నత పాఠశాలలకు వెళ్లాల్సి వచ్చింది.


ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో మొత్తం 79,860 మంది విద్యార్థులకు రవాణా ఛార్జీలు చెల్లించనుంది. 'ఒకటో తరగతి నుంచి 5 తరగతి వరకు ప్రాథమిక పాఠశాల ఆవాసానికి కిలోమీటరు కంటే ఎక్కువ దూరం ఉన్నా.. 6, 7, 8 తరగతుల పాఠశాలలు 3 కిలోమీటర్ల దూరం కంటే ఎక్కువ ఉన్నా ఒక్కో విద్యార్థికి నెలకు రూ.600 చొప్పున రవాణా ఛార్జీలు చెల్లిస్తారు. గతంలో విద్యా సంవత్సరం చివరలో ఒకేసారి రూ.6 వేలు ఇచ్చేవారు. కానీ ఈసారి మూడు నెలలకోసారి ఇస్తే విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఉపయోగపడుతుంది. ప్రభుత్వ స్కూళ్లు దూరంగా ఉన్న చోట పిల్లలు ఆటోల్లో బడులకు వెళ్తున్నారు.. తల్లిదండ్రులు ద్విచక్రవాహనాలపై దింపినా పెట్రోల్ ఖర్చు అవుతుంది' అన్నారు అధికారులు. నెల్లూరు జిల్లాలో ప్రభుత్వం చెల్లిస్తున్న రవాణా ఛార్జీలు పొందే విద్యార్థుల సంఖ్య (12951) ఎక్కువగా ఉంది.. అత్పల్యంగా గుంటూరు జిల్లాలో 437మంది ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa