అల్లూరి సీతారామరాజు పేరు కలకాలం గుర్తించుకునేలా వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఓ జిల్లాకు అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాగా నామకరణం చేశామని మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ అల్లూరి సీతారామరాజు 128వ జయంతి సందర్భంగా మన్యం వీరుడికి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఘన నివాళులర్పిస్తూ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. `బ్రిటిష్ పాలనను ఎదురించి, స్వరాజ్య సాధనలో ప్రాణాలు సైతం పణంగా పెట్టి పోరాడిన మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు గారు. గిరిజనుల హక్కులకోసం, వారి ఆత్మగౌరవం కోసం, వారితో కలిసి ఆయన చేసిన స్వాతంత్ర్య పోరాటం చిరస్మరణీయమైనది. ఆ గొప్ప యోధుడిని కలకాలం గుర్తుంచుకునేలా అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాను ఏర్పాటు చేసి, ఆయనను గౌరవించుకున్నాం. నేడు ఆ మహావీరుడి జయంతి సందర్భంగా నివాళులు’ అంటూ వైయస్ జగన్ ట్వీట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa