ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేరళలో మరోసారి నిఫా వైరస్ కలకలం

national |  Suryaa Desk  | Published : Mon, Jul 07, 2025, 04:36 PM

 కేరళలో మరోసారి నిఫా వైరస్ కలకలం రేపింది. నిఫా వైరస్ కారణంగా రాష్ట్రంలో ఇద్దరు మృతి చెందినట్లు వైద్యశాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. వారికి కాంటాక్ట్‌లో ఉన్న 383 మందిని పర్యవేక్షణలో ఉంచామని, 16 మందిని ఆసుపత్రిలో చేర్చామని తెలిపారు. ప్రజలు తీసుకునే ఆహారం నుండి నిఫా వైరస్ వ్యాపిస్తుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేరళ ప్రభుత్వం సూచించింది.వైరస్ సోకిన వాళ్లు తప్పనిసరిగా క్వారంటైన్ నిబంధనల్ని పాటించాలని కోరింది కేరళ ప్రభుత్వం. ఎప్పటికప్పుడు చేతుల్ని శానిటైజర్లతో శుభ్రం చేసుకోవాలని స్పష్టం చేసింది. ఒకవేళ జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి లాంటి లక్షణాలు వచ్చినా.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తినా వెంటనే హెల్త్ వర్కర్స్‌కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. నిఫా వైరస్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయని, రాష్ట్రంలో 425 మందిపై నిఘా ఉంచామని ఆమె తెలిపింది. వీరిలో 228 మంది మలప్పురం, 110 మంది పాలక్కడ్, 87 మంది కోజికోడ్ జిల్లాకు చెందిన వారు ఉన్నారని వీణా జార్జ్ వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa