ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యుత్ ఛార్జీల పెంపు డిస్కమ్ ల ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 10, 2025, 09:13 AM

ప్ర‌జలు, రైతులు నడ్డి విరిచేలా విద్యుత్ ఛార్జీలు పెంచాలన్న డిస్కమ్ ల ప్రతిపాదనలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ ఎన్నికలకు ముందు ఏ సభకు వెళ్లినా సందర్భం ఉన్నా లేకున్నా.. తాము రాబోయే ఐదేళ్లలో విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదని హామీ ఇచ్చారని.. తీరా అధికారంలోకి రాగానే ఛార్జీల పేరుతో భారం మోపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాకుండా నా దగ్గర మంత్రదండం ఉంది. ప్రతి ఒక్కరిని వ్యాపారవేత్తలను చేస్తానని నమ్మబలకడంతో పాటు మిమ్నిల్నే విద్యుత్ ఉత్పత్తిదారులగా చేసి మీ దగ్గర నుంచే విద్యుత్ కొనుగోలు చేసి సంపద సృష్టిస్తానని హామీలు సైతం ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఎలా పెంపు ప్రతిపాదనలు చేస్తారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో రూ.15,485 కోట్లు భారం వినియోగదారులపై వేయడంతో పాటు ఆ పాపాన్ని గత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై నెట్టివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రెండో ఏడాదికి వచ్చేటప్పటికి రూ.3629.87 కోట్లు అదనపు ఛార్జీలు వసూలు చేయాలని డిస్కమ్ లు విద్యుత్ నియంత్రణ మండలికి ప్రతిపాదనలు పంపించడం ద్వారా మరోసారి ప్రజల నెత్తిన భారం వేయడానికి మరోసారి కూటమి ప్రభుత్వం సన్నద్ధమైందని మండిపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa