ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తే సహించేది లేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 10, 2025, 10:02 AM

రాష్ట్రం నుంచి ఇతర దేశాలకు చేసే బియ్యం ఎగుమతులకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని, ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ సులువుగా ఎగుమతులు చేసుకోవచ్చని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ భరోసా ఇచ్చారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తే మాత్రం ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని హెచ్చరించారు. ఈ మేరకు కాకినాడ, విశాఖపట్నం, నెల్లూరు జిల్లాల జాయింట్‌ కలెక్టర్లు, పౌరసరఫరాలశాఖ అధికారులతో మంత్రి నాదెండ్ల బుధవారం సచివాలయంలోని తన చాంబర్‌లో సమావేశం నిర్వహించారు. రాష్ట్రం నుంచి బయటికి వెళ్లే బియ్యంలో పీడీఎస్‌ బియ్యం ఉండే ప్రసక్తే లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అక్రమాలకు పాల్పడేవారిపై 6ఎ కేసులతోపాటు పీడీ యాక్ట్‌, బీఎన్‌ఎస్‌ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని సూచించారు. విశాఖపట్నం, కాకినాడ, నెల్లూరు పోర్టులలో చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసి 24/7 సిబ్బందితో నిరంతరం తనిఖీలు కొనసాగించాలని ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa