మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గత ప్రభుత్వ హయాంలో అత్యంత కీలకమైన ఎక్సైజ్ శాఖలో పనిచేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ రజత్ భార్గవకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నోటీసులు జారీ చేసింది. శుక్రవారం విజయవాడలోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో స్పష్టం చేసింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం సేకరణ, పంపిణీ, ధరల నిర్ణయంలో భారీ అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సిట్ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో, అప్పట్లో ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రజత్ భార్గవ పాత్రపై సిట్ దృష్టి సారించింది. ప్రైవేట్ మద్యం సిండికేట్లతో కుమ్మక్కై వారికి ప్రయోజనం చేకూర్చారనే ఆరోపణల నేపథ్యంలో ఆయనను ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa