ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య, ప్రభుత్వంపై మండిపడ్డ తన్నీరు నాగేశ్వరరావు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 14, 2025, 02:47 PM

ఎన్టీఆర్ జిల్లా, వత్సవాయి మండలం, పెంట్యాల వారి గూడెం గ్రామానికి చెందిన కౌలు రైతు తూనం రమేష్ గత రెండు రోజుల క్రితం అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు గారు స్థానిక నాయకులతో కలిసి గ్రామంలో వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించి, పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ...కూటమి ప్రభుత్వంలో పంటకు సరైన గిట్టుబాటు ధరలు లేక మరియు రైతులకు ప్రతి సంవత్సరానికి 20వేల రూపాయలు పెట్టుబడి సహాయం ఇస్తా అన్నారు, ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడుస్తున్నా కానీ ఇంతవరకు ఆర్థిక సహాయం అందించలేదు.రైతులు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధరలు లేవు, ఎరువులు రేటు చూస్తేనే ఆకాశాన్ని అందుతున్నాయి, ఇవన్నీ పెనుభారం గా అవ్వటం కారణం చేత రైతులు దిగులు చెంది అప్పుల పాలే ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కనపడుతుంది. దేశానికి అన్నం పెట్టే రైతు వెన్నెముక అంటారు నోటి మాటలే తప్ప చేతల్లో చేసింది ఏమీ లేదు. ఈ ప్రభుత్వం.కౌలు రైతులకి కౌలు కార్డులు సక్రమంగా అందించారని, ఈ సంవత్సరం మిర్చి, పత్తి వేసి రైతులు తీవ్ర అప్పులు పాలయ్యారు, రైతులకు విత్తనాలు ఎరువులు సకాలంలో అందటం లేదు అని వాపోయారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa