ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గవర్నర్‌గా అశోక్‌గజపతిరాజు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 14, 2025, 03:16 PM

గోవా గవర్నర్‌గా పూసపాటి అశోక్‌గజపతిరాజు  నియమితులయ్యారు. మూడు రాష్ట్రాలకు గవర్నర్‌‌లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు (సోమవారం) ఉత్తర్వులు జారీ చేశారు. హర్యానా గవర్నర్‌గా ఆషింకుమార్‌ ఘోష్‌, గోవా గవర్నర్‌గా అశోక్ గజపతి రాజు, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా కవిందర్ గుప్తా‌లను కేంద్రం నియమించింది. విజయనగరానికి చెందిన అశోక్ గజపతి రాజు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ మెంబర్‌గా ఉన్నారు. గతంలో ఆయన కేంద్రమంత్రిగా పనిచేశారు. తాజాగా ఆయనను గోవా గవర్నర్‌గా నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa