తిరుపతి రైల్వేస్టేషన్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తిరుపతి రైల్వేస్టేషన్ లో రైలులో మంటలు చెలరేగాయి. తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి గ్యారేజ్కు తీసుకెళ్తున్న తిరుపతి హిసార్ ఎక్స్ప్రెస్ రైళ్లో మంటలు చెలరేగాయి. ప్రయాణికులను కిందకు దించేసి లూప్ లైన్లో రైలు ఆగి ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తొలుత ఓ బోగీలో చెలరేగిన మంటలు.. ఆ పక్కనే ఉన్న మరో బోగీకి కూడా విస్తరించాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో తిరుపతి రైల్వేస్టేషన్ లోపల ఉన్న ప్రయాణికులు కంగారు పడ్డారు. అయితే వెంటనే అక్కడకు చేరుకున్న ఫైరింజన్ సిబ్బంది మంటలను నియంత్రించారు. రైల్వే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కలిసి మంటలను నియంత్రించారు. ఈ ఘటనలో ఒక బోగీ పూర్తిగా కాలిపోయింది.ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా నిప్పు పెట్టారా లేక ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనా అని ఆరా తీస్తున్నారు.
తిరుపతి రైల్వేస్టేషన్కు ప్రయాణికుల తాకిడి ఎక్కువ. తిరుమల శ్రీవారి దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులతో రైల్వేస్టేషన్ కిటకిటలాడుతూ ఉంటుంది. వచ్చీపోయే రైళ్లు, ప్రయాణికులతో రైల్వేస్టేషన్లో హడావిడి వాతావరణం ఉంటుంది. అయితే రైలు బోగీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగటంతో ప్రయాణికులు, శ్రీవారి భక్తులు భయపడిపోయారు. అయితే లూప్ లైన్లో నిలిపి ఉంచిన ఖాళీ రైలు అని తెలియటంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంపై రైల్వే పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఎవరైనా ఆకతాయిలు నిప్పు పెట్టారా లేక ప్రమాదవశాత్తూ మంటలు అంటుకున్నాయా అనే విషయంపై దర్యాప్తు జరుపుతున్నారు.
మరోవైపు తిరుపతి జిల్లా గాజుల మండ్యం మండలంలో ప్రమాదం జరిగింది. గాజుల మండ్యం పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం జరిగింది. పారిశ్రామికవాడలో ఉన్న క్రోమో మెడికేర్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ముగ్గురు కార్మికులకు గాయాలయ్యాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఎంతో శ్రమించి మంటలను నియంత్రించారు. గాయపడిన కార్మికులకు వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa