ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్రం అఖిలపక్ష సమావేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 21, 2025, 08:22 AM

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో కేంద్రం అఖిలపక్ష సమావేశం జరిగింది. వైయ‌స్ఆర్‌సీపీ తరఫున ఎంపీలు గురుమూర్తి, పిల్లి సుభాష్ చంద్రబోస్ హాజరయ్యారు. నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. పార్లమెంటు సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని కేంద్రం విజ్ఞప్తి చేశారు. ఏపీలో క్షీణిస్తున్న శాంతి భద్రతలు, వైయ‌స్ఆర్‌సీపీ నేతల అక్రమ అరెస్టుల అంశాన్ని పార్లమెంటు సమావేశాల్లో ఆ పార్టీ లేవనెత్తనుంది. రాష్ట్రంలోని ఖనిజ సంపదను అప్పుల కోసం ఏపీఎండీసీ తాకట్టు పెట్టడం, పోలవరం ఆలస్యం, రైతుల సమస్యలు.. ధాన్యం సేకరించకపోవడం గిట్టుబాటు ధరలు కల్పించకపోవడం, అమరావతిలో అవినీతి, సూపర్ సిక్స్ ఫెయిల్,  విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కరణ, మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ, ఏపీలో పెరుగుతున్న నిరుద్యోగం, నత్త నడకన ఇళ్ల నిర్మాణాలు, తిరుమలలో భద్రత లోపాలు తదితర అంశాలను వైయ‌స్ఆర్‌సీపీ ప్రస్తావించనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa