భారత వైమానిక దళం (ఐఏఎఫ్) చరిత్రలో ఒక శకం ముగియనుంది. దాదాపు 62 సంవత్సరాలుగా భారత ఆకాశంలో తనదైన ముద్ర వేసిన ఐకానిక్ మిగ్-21 ఫైటర్ జెట్లను సెప్టెంబర్ 2025 నాటికి పూర్తిగా ఉపసంహరించుకోనున్నట్ట ఐఏఎఫ్ ప్రకటించింది. రాజస్థాన్లోని నల్ ఎయిర్ ఫోర్స్ బేస్లో ప్రస్తుతం కార్యకలాపాలు సాగిస్తున్న ఈ సోవియట్-యుగం జెట్ల స్థానంలో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేజస్ లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ (ఎల్సీఏ) మార్క్-1ఏ రంగ ప్రవేశం చేయనుంది. ఈ నిర్ణయం ఐఏఎఫ్ ఆధునీకరణలో కీలక అడుగుగా భావిస్తున్నారు. అయితే తేజస్ జెట్ల డెలివరీలో ఆలస్యం స్క్వాడ్రన్ సంఖ్యపై ప్రభావం చూపుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa