ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో ఇంజినీరింగ్ విద్యార్థులకు శుభవార్త – కీలక నిర్ణయం విడుదల!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 23, 2025, 10:40 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన APEAPCET 2025 ఫలితాల తర్వాత, ప్రస్తుతం కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి మొదటి విడత సీట్ల కేటాయింపు జాబితాను అధికారికంగా విడుదల చేశారు.కాగా షెడ్యూల్ ప్రకారం ఈ ప్రక్రియ జూలై 16న జరగాల్సి ఉండగా.. సాంకేతిక కారణాల వల్ల ప్రాసెసింగ్ ఆలస్యమవడంతో ఈరోజు (జూలై 17, 2025 )న విడుదల చేశారు.విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్, పాస్‌వర్డ్‌ ద్వారా అధికారిక వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయి సీటు కేటాయింపు వివరాలు తెలుసుకోవచ్చు. ఎవరి కి ఏ కళాశాలలో, ఏ బ్రాంచ్‌లో సీటు వచ్చిందో స్పష్టంగా అక్కడ చూపించబడుతుంది. ఈ సీట్ల కేటాయింపు విద్యార్థులు కౌన్సెలింగ్ సమయంలో ఇచ్చిన వెబ్ ఆప్షన్ల ఆధారంగా జరిగింది.సీట్ల కేటాయింపు ఫలితాలను ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.APEAPCET 2025 మొదటి విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయ్యింది. విద్యార్థులు తమ సీటు కేటాయింపు వివరాలను చెక్ చేసుకోవాలంటే, అధికారిక వెబ్‌సైట్‌ అయిన https://eapcet-sche.aptonline.in/EAPCET/ కు వెళ్లాలి. హోమ్‌పేజీలో కనిపించే “Download Allotment Order” అనే లింక్‌పై క్లిక్ చేసి, హాల్ టికెట్ నంబర్ మరియు పుట్టిన తేదీని నమోదు చేయాలి. అనంతరం, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది – దాన్ని ఎంటర్ చేసిన తర్వాత విద్యార్థులు Allotment Order, Self-Reporting Letter, Web Options Report వంటి అవసరమైన డాక్యుమెంట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.సీటు కేటాయించిన కళాశాలలో రిపోర్ట్ చేయడానికి విద్యార్థులు కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లను తప్పనిసరిగా తీసుకెళ్లాలి. వాటిలో ముఖ్యంగా: APEAPCET కౌన్సెలింగ్ ఆన్‌లైన్ స్లిప్, ర్యాంక్ కార్డు, అడ్మిట్ కార్డు, 10వ తరగతి మెమో, 6వ తరగతి నుంచి ఇంటర్ వరకూ స్టడీ సర్టిఫికెట్లు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, నివాస ధ్రువీకరణ పత్రం లేదా లోకల్ స్టేటస్ సర్టిఫికెట్ ఉన్నాయి. అంతేగాక, విద్యార్థి రిజర్వేషన్‌కు సంబంధించిన కేటగిరీకి (SC/ST/BC/EWS/PWD/NCC/Sports/Ex-Servicemen) సరిపోయే సర్టిఫికెట్లు కూడా తీసుకెళ్లాలి.కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా జూలై 26, 2025లోపు విద్యార్థులు కేటాయించిన కాలేజీలలో రిపోర్ట్ అవ్వాలి. తరగతులు ఆగస్టు 4, 2025 నుంచి ప్రారంభం కానున్నాయి. అలాగే, రెండో విడత కౌన్సెలింగ్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను APSCHE త్వరలోనే విడుదల చేయనుంది.ఇక పరీక్షల విషయానికి వస్తే, ఈ ఏడాది APEAPCET పరీక్షను రాష్ట్రవ్యాప్తంగా కాకుండా హైదరాబాద్‌ సహా మొత్తం 145 కేంద్రాల్లో నిర్వహించారు. మొత్తం 3,62,448 మంది దరఖాస్తు చేసుకోగా, 3,40,300 మంది హాజరయ్యారు. వీరిలో 2,57,509 మంది విద్యార్థులు, అంటే సుమారు 75.67 శాతం ఉత్తీర్ణత సాధించారు. మే 19 నుంచి 20 వరకు అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు నాలుగు సెషన్లలో నిర్వహించిన పరీక్షలకు 75,460 మంది హాజరయ్యారు. ఇందులో 67,761 మంది విద్యార్థులు (89.80%) అర్హత సాధించారు. ఇక మే 21 నుంచి 27 వరకు ఇంజినీరింగ్ విభాగానికి నిర్వహించిన 10 సెషన్ల పరీక్షలకు 2,64,840 మంది హాజరయ్యారు. అందులో 1,89,748 మంది విద్యార్థులు, అంటే 71.65 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు వెల్లడించారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa