ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రావణ మాసం తొలిరోజే.. తిరుపతిలో అద్భుతం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 25, 2025, 08:06 PM

తిరుపతిలో అద్భుతం జరిగింది. ఓ శివాలయంలో శివుడి విగ్రహం కళ్లు తెరిచింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో భక్తులు శివాలయానికి తరలి వస్తున్నారు. మరోవైపు శాస్త్రీయ కారణాలతో ఇలా జరిగి ఉండొచ్చని నిపుణులు చెప్తున్నారు. వాతావరణ పరిస్థితులు, కాంతి పరావర్తనం , ఇల్యూజన్ వంటి కారణాలతో ఇలా జరిగి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. అయితే ఆలయానికి మాత్రం భక్తులు తరలి వస్తున్నారు.


తిరుపతిలో అద్భుతం.. అంతా శివయ్య మహిమే!


శ్రావణమాసం ప్రారంభమైన రోజే తిరుపతిలో ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. స్థానిక గాంధీ నగర్‌లో ఉన్న రామలింగేశ్వర ఆలయంలో శివుడి విగ్రహం కళ్లు తెరిచిందంటూ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఈ విషయం తెలుసుకున్న భక్తులు భారీ సంఖ్యలో గుడికి చేరుకుని శివయ్య విగ్రహానికి పూజలు నిర్వహించారు. భక్తులు తరలిరావటంతో ఆ ప్రదేశం రద్దీగా మారిపోయింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.


అసలేం జరిగిందంటే.. గోవిందరాజు స్వామి ఆలయం సమీపంలోని ఓ చిన్న శివాలయం.. ఇప్పటివరకు పెద్దగా ఎవరూ పట్టించుకోని ఆ ఆలయం ఒక్కసారిగా భక్తులతో కళకళలాడుతోంది. దీనికి కారణం ఆలయ ప్రాంగణంలోని శివలింగం విగ్రహం కళ్లు తెరవడమే. దీన్ని చూసిన కొంతమంది ఆ పరమశివుడే కళ్లు తెరిచాడని అంటున్నారు. మొదట అందరికి ఈ సంఘటన ఆశ్చర్యానికి గురిచేసినా.. ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో.. జనం విశ్వాసం ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో ఆలయం బయట రాత్రి నుంచే భక్తులు క్యూ కట్టడం ప్రారంభించారు. ఉదయానికల్లా వందల మంది భక్తులు ఆలయాన్ని దర్శించేందుకు చేరుకున్నారు. స్థానికులు, కుటుంబాలతో పాటు దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఈ దృశ్యాన్ని చూడటానికి క్యూ కట్టారు.


మరి, నిజంగానే శివుడు కళ్లు తెరిచాడా అంటే.. కొన్ని ఫొటోలు, వీడియోల్లో శివుడి కళ్లల్లో కాంతి కనిపించినట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ పరిణామాలపై అధికారులు స్పందించారు. దీనిపై పూర్తిస్థాయి సమాచారం సేకరిస్తున్నామని.. నిపుణులతో కలిసి చర్చిస్తున్నామని అంటున్నారు. అయితే ఇంతవరకు ఆలయ కమిటీ ఈ ఘటనను అధికారికంగా ధృవీకరించలేదు.


మరోవైపు కొంతమంది నిపుణులు మాత్రం వాతావరణ పరిస్థితుల కారణంగా.. ఇలా జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అప్పుడప్పుడూ వినాయకుడు పాలు తాగడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శివుడి విగ్రహం కళ్లు తెరిచిందని.. దీని వెనుక శాస్త్రీయ కారణాలు ఉండొచ్చంటున్నారు నిపుణులు.. కాంతి పరావర్తనం, ఆప్టికల్ ఇల్యూజన్, విగ్రహం రూపకల్పన, వాతావరణ పరిస్థితుల వలన ఇలా జరగొచ్చని నిపుణులు చెప్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa