ఐదవ టెస్ట్లో ఓవల్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మ్యాచ్లో, భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ రెండో ఇన్నింగ్స్లో మెరిసి అద్భుత శతకం నమోదు చేశాడు.
51వ ఓవర్ రెండో బంతికి సింగిల్ తీసిన యశస్వి జైస్వాల్, అద్భుత సెంచరీని నమోదు చేశాడు.
127 బంతుల్లో 11 బౌండరీలు, 2 సిక్సర్లతో శతకాన్ని పూర్తిచేసుకున్న అతడికి ఇది టెస్టు కెరీర్లో 6వ సెంచరీ కాగా, ఇంగ్లండ్పై ఇది నాల్గో శతకం కావడం గమనార్హం.శతకం అనంతరం జైస్వాల్ చేసిన సెలబ్రేషన్స్కి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గాల్లోకి జంప్ చేసి పంచ్ ఇచ్చిన అనంతరం, గ్యాలరీవైపు చూసి ముద్దులు పంపించాడు. అంతేకాదు, హార్ట్ సింబల్ కూడా చూపిస్తూ తనదైన శైలిలో అభిమానులను అలరించాడు.ఇంతకు ముందు కూడా అతడు ఇలాగే సెలెబ్రేట్ చేసినప్పటికీ, ఈ సారి చూపించిన లవ్ సింబల్ ప్రత్యేకంగా చర్చకు మారింది. ‘ఆ ముద్దులు ఎవరికో?’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.అయితే నిజానికి, ఈ మ్యాచ్ను చూసేందుకు జైస్వాల్ తల్లిదండ్రులు ఓవల్ మైదానానికి వచ్చారు. వారి కోసం ఈ ప్రత్యేక సెలెబ్రేషన్ చేశాడు. , తన ఈ శతకాన్ని స్టేడియంలో ఉన్న హిట్మ్యాన్ రోహిత్ శర్మకి అంకితం చేశాడు.రెండో ఇన్నింగ్స్లో జైస్వాల్ 164 బంతుల్లో 118 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈ ఇన్నింగ్స్లో అతడు 14 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. భారత్ ప్రస్తుతం 84 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 357 పరుగులు చేసింది. క్రీజులో ప్రసిద్ధ్ కృష్ణ (0), వాషింగ్టన్ సుందర్ (17) ఉన్నారు.ప్రస్తుతం భారత్ 341 పరుగుల భారీ ఆధిక్యంలో ఉంది. సుందర్ కొన్ని వేగవంతమైన పరుగులు చేయగలిగితే, మ్యాచ్ ఫలితం భారత్ వైపు తిప్పే అవకాశముంది. అయితే, చివరికి సిరీస్ గెలుపు టీమిండియా బౌలర్లపై ఆధారపడి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa