కృష్ణా జిల్లా పెనమలూరులో డీజిల్ దొంగలు రెచ్చిపోయారు. పెనమలూరు హైస్కూల్ సర్కిల్ వద్ద నిలిపి ఉంచిన బస్సులలో నుంచి డీజిల్ చోరీ చేశారు. నాలుగు సిటీ ఆర్టీసీ బస్సులతో పాటుగా.. ఓ స్కూల్ బస్సులోని డీజిల్ను సైతం ఇలాగే రాత్రి పూట వచ్చి మాయం చేసినట్లు అనుమానిస్తున్నారు. కారులో వచ్చి ట్యూబుల ద్వారా డీజిల్ చోరీ చేసి పారిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. సీసీ ఫుటేజీ సాయంతో దొంగలను కనిపెట్టే పనిలో ఉన్నారు."don't judge a book by its cover" అనే ఒక సామెత గుర్తుందా.. ఎవరినీ కూడా పైపైన చూసి ఓ అంచనాకు రాకూడదనేది దాని ఉద్దేశం. పైకి కనిపించేదే నిజమని నమ్మకూడదని, ఎవరి సత్తా ఏపాటిదో పైన రూపం చూసి అంచనా వేయొద్దని దాని ఉద్దేశం. ఈ సామెతను మంచి ఉద్దేశంతో మన పెద్దలు చెప్పినప్పటికీ.. మనం ఇప్పుడు చెప్పుకోబోయే విషయానికి కూడా దీనిని అన్వయించుకోవచ్చు. ఖరీదైన కార్లలో తిరిగేవారంతా మంచోళ్లు కాదని.. వారి మెదళ్లల్లోనూ చిల్లర ఆలోచనలు ఉంటాయని ఈ ఘటన ద్వారా రుజువు అవుతోంది. ఈ ఘటన కృష్ణా జిల్లా పెనమలూరులో చోటుచేసుకుంది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పెనమలూరు హైస్కూల్ సర్కిల్.. గురువారం అర్ధరాత్రి 11 గంటల సమయం.. ఓ నాలుగు సిటీ బస్సులు వచ్చి ఆగాయి. డ్యూటీలు ముగియటంతో లాస్ట్ ట్రిప్పులు పూర్తి చేసి హైస్కూల్ సర్కిల్ వద్ద బస్సులను పార్క్ చేశారు ఆర్టీసీ డ్రైవర్లు. శుక్రవారం ఉదయమే మళ్లీ సర్వీసులు ప్రారంభించాల్సి ఉండటంతో.. బస్సులను అక్కడ నిలిపి నిద్రపోయారు. శుక్రవారం తెల్లవారుజామున నిద్రలేచిన డ్రైవర్లు.. బస్సులను స్టార్ట్ చేసేందుకు ప్రయత్నించారు.
అయితే ఎంత ప్రయత్నించినా కూడా నిమిషానికే బస్సులు ఆగిపోతున్నాయి. దీంతో స్థానికుల సాయంతో బస్సులను కొంత దూరం నెట్టి ఇంజిన్ స్టార్ట్ చేసేందుకు యత్నించారు. వారెంత ప్రయత్నించినా బస్సులు స్టార్ట్ కాలేదు. దీంతో అనుమానం వచ్చిన డ్రైవర్లు.. బస్సు ఆయిల్ ట్యాంకులను పరిశీలిస్తే అసలు విషయం తెలిసింది. ఆయిల్ ట్యాంకులు మొత్తం ఖాళీగా కనిపించాయి. ఆయిల్ ట్యాంకులోని డీజిల్ ఎవరో చోరీ చేశారంటూ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇక ఆర్టీసీ బస్సు డ్రైవర్ల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు పెనమలూరు హైస్కూల్ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించారు. ఈ క్రమంలోనే వారికో విషయం తెలిసివచ్చింది. నలుగురు యువకులు ఓ కారులో వచ్చి బస్సుల్లోని డీజిల్ దొంగతనం చేసినట్లు సీసీ కెమెరాల ద్వారా వెల్లడైంది. ట్యూ్బ్ల సాయంతో బస్సులు ఆయిల్ ట్యాంకర్లలోని డీజిల్ను బయటకు తీసి.. పెద్ద పెద్ద ప్లాస్టిక్ క్యాన్లలో నింపుకున్నారు. అనంతరం అదే కారులోనే అక్కడి నుంచి ఉడాయించారు.
ఆర్టీసీ బస్సులతో పాటుగా అక్కడే నిలిపి ఉంచిన ఓ స్కూలు బస్లోనూ డీజిల్ చోరీ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మొత్తంగా 700 నుంచి 800 లీటర్ల వరకూ డీజిల్ చోరీ చేసినట్లు పెనమలూరు పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీ ఫుటేజీ సాయంతో అనుమానితులను కనిపెట్టే పనిలో పడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa