అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్, మళ్లీ తన వైఖరిని స్పష్టంగా వెల్లడించారు. "మేక్ అమెరికా గ్రేట్ అగైన్" అనే నినాదంతో దేశాభివృద్ధి దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. విదేశాంగ విధానం నుంచీ, దేశీయ ఆర్థిక వ్యవస్థ వరకు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు గ్లోబల్గా ప్రభావం చూపిస్తున్నాయి.
అమెరికాలో పనిచేస్తున్న కంపెనీలు స్థానికులకు ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని ట్రంప్ స్పష్టం చేశారు. విదేశాల నుంచి అమెరికాలోకి వచ్చే వలసదారుల విషయంలో ఆయన మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. వీసా గడువు ముగిసిన వారు, అక్రమంగా దేశంలో ఉన్నవారి విషయంలో కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
అక్రమ వలసదారుల గుర్తింపు, తిరిగి స్వదేశాలకు పంపే ప్రక్రియను ట్రంప్ ప్రభుత్వం ఓ ఉద్యమంలా కొనసాగిస్తోంది. ఇందుకోసం ప్రత్యేక బృందాలను నియమించి, ఎక్కడైనా ఉల్లంఘనలు జరిగినా వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలో జీవించాలన్న లక్ష్యంతో వచ్చిన ఎందరో వలసదారులకు భయాందోళనలు పెరిగిపోతున్నాయి.
ఒకప్పుడు అవకాశాల భూమిగా చెప్పుకున్న అమెరికా ఇప్పుడు కఠిన ఆంక్షల చట్టాలతో చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ తీసుకుంటున్న తీర్మానాలు ఒకవైపు దేశ భద్రతను మెరుగుపరిచే ప్రయత్నంగా ఉన్నప్పటికీ, మరోవైపు వలసదారుల ఆశలను నిరాశగా మార్చుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa