ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్న రక్షణ మంత్రి

national |  Suryaa Desk  | Published : Sat, Aug 30, 2025, 02:01 PM

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చైనాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనపై ఇరు దేశాల్లో ఆసక్తి నెలకొనగా భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాల మధ్య శాశ్వత శత్రుత్వం ఉండదని చెప్పారు. దేశ ప్రయోజనాలే శాశ్వతమని స్పష్టం చేశారు. ‘శాశ్వత మిత్రులు కానీ, శత్రువులు కానీ ఉండరు. దేశాల మధ్య శాశ్వత శత్రుత్వం ఉండదు. కేవలం ఆ దేశానికి ఉపయోగపడే శాశ్వత ప్రయోజనాలే ఉంటాయి’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఓ జాతీయ మీడియా సదస్సులో పాల్గొన్న రక్షణ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa