సీఎం చంద్రబాబు ఏరికోరి టీటీడీ ఈవోగా తెచ్చుకున్న జె.శ్యామలరావు 15 నెలలకే బదిలీ కావడం టీటీడీ వర్గాల్లో విస్మయాన్ని రేకెత్తిస్తోంది. జీఏడీ (పొలిటికల్)లో కార్యదర్శిగా ఆయన్ను నియమిస్తూ సోమవారం బదిలీ ఉత్తర్వులు వచ్చాయి. చంద్రబాబు సీఎం హోదాలో తొలిసారి తిరుమలకు రాకముందే.. అప్పటికి ఇన్చార్జి ఈవోగా ఉన్న ధర్మారెడ్డిని ప్రభుత్వం ఆగమేఘాలపై తప్పించి శ్యామలరావును నియమించింది. ఆ తర్వాతే సీఎం హోదాలో చంద్రబాబు తిరుమల వెళ్లారు. రాష్ట్రంలో గాడి తప్పిన పాలనను ప్రక్షాళన చేస్తానని, ఆ ప్రక్రియ టీటీడీ నుంచే ప్రారంభిస్తానని ఆ సందర్భంగా చంద్రబాబు ప్రకటించారు. అయితే, టీటీడీ పరిపాలనలో సీఎం ఆలోచనలు, అంచనాలకు అనుగుణంగా పనిచేయడంలో శ్యామలరావు వెనకబడటంతో బదిలీ జరిగిందన్న ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది జనవరిలో తిరుపతి బైరాగిపట్టెడలోని వైకుంఠ ద్వారదర్శన టోకెన్ల జారీ కేంద్రాల వద్ద తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు మృతి చెందగా, 40 మంది గాయపడిన సంగతి తెలిసిందే. ఆ ఘటనతో సీఎం చంద్రబాబు టీటీడీ అధికార యంత్రాంగంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటి నుంచే ఆయనలో టీటీడీ ఈవో పట్ల అసంతృప్తి మొదలైనట్టు సమాచారం. దానికి తోడు పలు ఇతర కారణాలూ తోడయ్యాయని టీటీడీ, రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa