ఢిల్లీ నగరంలో మళ్లీ బాంబు బెదిరింపు మెయిల్ కలకలం రేపింది. మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజ్ (MAMC) మరియు ఢిల్లీ సెక్రటేరియట్లోని ముఖ్యమంత్రి కార్యాలయానికి ఈ బెదిరింపు మెయిల్ చేరింది. మెయిల్లో మంగళవారం మధ్యాహ్నం 2:45 గంటలకు MAMCలో, 3:30కు సీఎం కార్యాలయంలో బాంబు పేలుడు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ సమాచారం వెంటనే పోలీసులకు చేరడంతో అప్రమత్తమయ్యారు.
విషయం తెలిసిన వెంటనే బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ఇతర భద్రతా సిబ్బంది రెండు చోట్లా దర్యాప్తు ప్రారంభించారు. భవనాల మొత్తం ప్రాంతాన్ని ఖాళీ చేయించి, శోధన చేపట్టారు. అప్రమత్తత చర్యల్లో భాగంగా ట్రాఫిక్ను కూడా దారి మళ్లించారు.
పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఈ మెయిల్ గతంలో వచ్చిన నకిలీ బెదిరింపు మెయిల్కు పోలికలతో ఉన్నట్లు తేలింది. గతంలో కూడా ఇలాగే సమానమైన సందర్భంలో బెదిరింపు మెయిల్ వచ్చినప్పటికీ అది నకిలీగా నిర్ధారణ అయింది. అయినప్పటికీ ఏ మాత్రం లాపర లేకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
బాంబు బెదిరింపులు వాస్తవంగా ఉన్నా, లేనప్పటికీ ప్రజలలో భయానక వాతావరణాన్ని కలిగిస్తున్నాయి. అందుకే అలాంటి మెయిళ్లను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని, బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు తెలిపారు. ప్రజల భద్రత కోసం పోలీసులు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నారని కూడా పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa