ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భర్తని కిరాతకంగా హత్యచేపించిన వివాహేతర సంభందం పెట్టుకున్న భార్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 09, 2025, 04:58 PM

వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. ప్రియుడి మోజులో పడిన ఓ భార్య, కట్టుకున్న భర్తనే కిరాతకంగా హత్య చేయించిన దారుణ ఘటన కర్నూలు జిల్లాలో వెలుగుచూసింది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఆస్పరి మండలం తొగలగల్లు గ్రామానికి చెందిన అహోబిలం, పద్మావతి దంపతులు. అయితే, కొంతకాలంగా పద్మావతికి చెన్నబసవ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగుతోంది. తమ బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన పద్మావతి, అతడిని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో తన భర్తను హత్య చేయాలని ప్రియుడు చెన్నబసవను కోరింది.ప్రియురాలి మాటతో హత్యకు సిద్ధమైన చెన్నబసవ, ఇందుకోసం బెంగళూరు నుంచి తొగలగల్లుకు వచ్చాడు. పక్కా ప్రణాళికతో, సెప్టెంబర్ 3వ తేదీకి ముందు బైక్‌పై ఒంటరిగా వెళ్తున్న అహోబిలంను అడ్డగించాడు. అనంతరం తన వెంట తెచ్చుకున్న కత్తితో అహోబిలంపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలతో అహోబిలం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, నిందితుడు చెన్నబసవ అక్కడి నుంచి పరారయ్యాడు.ఈ నెల 3వ తేదీన తొగలగల్లు, దొడగొండ గ్రామాల మధ్య ఉన్న డంపింగ్ యార్డు వద్ద ఓ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతుడిని అహోబిలంగా నిర్ధారించి కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా భార్య పద్మావతి ప్రవర్తనపై అనుమానం రావడంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో ఆమె నేరం అంగీకరించడంతో, ఈ హత్య వెనుక ఉన్న వివాహేతర సంబంధం గుట్టు రట్టయింది. పద్మావతి ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఆమె ప్రియుడు చెన్నబసవను కూడా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఇద్దరినీ విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa