ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాయలసీమ ద్రోహి జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 09, 2025, 05:01 PM

వైసీపీ అధినేత జగన్ రాయలసీమకు తీరని ద్రోహం చేశారని, ఆయన పాలనలో ఆ ప్రాంతాన్ని పూర్తిగా విస్మరించారని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ధ్వజమెత్తారు. జగన్ వైఖరి కారణంగా రాయలసీమలో ఆయనకు ఒక్క ఓటు కూడా లభించని పరిస్థితి నెలకొందని ఆయన వ్యాఖ్యానించారు. అధికారంలో లేకపోయినా వైసీపీ కుట్ర రాజకీయాలు మానడం లేదని, రైతుల ముసుగులో అన్నదాతలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.రాష్ట్రంలో కృత్రిమంగా యూరియా సంక్షోభాన్ని సృష్టించి, ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేసేందుకు వైసీపీ నేతలు కుట్ర పన్నుతున్నారని జీవీ ఆంజనేయులు ఆరోపించారు. రైతు సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే, వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరై చర్చలో పాల్గొనాలని ఆయన సవాల్ విసిరారు. వారు సభకు వస్తే, రైతు సమస్యలపై చర్చించేందుకు ప్రత్యేకంగా గంట సమయం కేటాయించేందుకు కూడా తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa