ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ మద్యం కేసు.. జగన్‌ సన్నిహితుడిపై సిట్‌ దర్యాప్తు ముమ్మరం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 11, 2025, 03:25 PM

ఏపీ మద్యం కుంభకోణం కేసులో సిట్‌ దర్యాప్తు వేగం పెంచింది. ఈ కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డికి సన్నిహితుడైన నర్రెడ్డి సునీల్‌రెడ్డికి సంబంధించిన సంస్థలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) సోమవారం నుంచి ముమ్మరంగా తనిఖీలు ప్రారంభించింది.
హైదరాబాద్‌, విశాఖపట్నం నగరాల్లో ఉన్న 10 కంపెనీల కార్యాలయాల్లో సిట్‌ అధికారులు ఆకస్మికంగా సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 3లోని స్నేహహౌస్‌, రోడ్‌ నంబర్‌ 2లోని సాగర్‌ సొసైటీ, కాటేదాన్‌-రాజేంద్రనగర్‌, ఖైరతాబాద్‌ కమలాపురి కాలనీ ఫేజ్‌-1 వంటి ప్రాంతాల్లో ఈ దర్యాప్తు కొనసాగుతోంది.
విశాఖపట్నంలో వాల్తేర్‌ రోడ్‌లోని వెస్ట్‌వింగ్‌ కార్యాలయంలోనూ అధికారులు సోదాలు చేపట్టారు. హైదరాబాద్‌, విశాఖలో ఒకేసారి సిట్‌ బృందాలు తనిఖీలు జరుపుతూ కేసుకు సంబంధించి కీలక ఆధారాలు సేకరిస్తున్నాయి. ప్రతి కార్యాలయంలో డిజిటల్ డేటా, లావాదేవీల పత్రాలు, సీసీ టీవీ ఫుటేజ్‌లు, ల్యాప్‌టాప్‌లు పరిశీలిస్తున్నారు.
సునీల్‌రెడ్డి హైదరాబాద్‌లో 8 కంపెనీలకు సంబంధించిన 4 కార్యాలయాలు, విశాఖలోని 2 కంపెనీలకు ఒక కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. ఆయా కార్యాలయాలన్నింటిని అధికారులు గమనించి, ఆదాయ వనరులు, మద్యం సరఫరా లావాదేవీలపై స్పష్టత సాధించేందుకు విచారణను ముమ్మరం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa