ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుప‌తిలో జనసేన నుండి వైసీపీ లోకి చేరికలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 14, 2025, 04:22 PM

కూట‌మి ప్ర‌భుత్వానికి తిరుప‌తి న‌గ‌రంలో ముస్లిం మైనారిటీలు భారీ షాక్ ఇచ్చారు. న‌గ‌రంలోని 36వ డివిజ‌న్‌కు చెందిన టీడీపీ, జ‌న‌సేన మైనారిటీ విభాగం నాయ‌కులు ప‌లువురు తిరుపతి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ ఇంచార్జ్ భూమన అభినయ్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో వైయ‌స్ఆర్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు.  శ‌నివారం 35 ముస్లిం కుటుంబాలు, మ‌రో వంద మంది వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. వారికి భూమ‌న అభిన‌య్‌రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. 2029  ఎన్నిక‌ల్లో తిరుప‌తి ఎమ్మెల్యేగా అభినయ్ రెడ్డిని భారీ మెజరిటీతో గెలిపిస్తాంటున్న ముస్లిం మైనారిటీలు నిన‌దించారు.  ఈ సందర్భంగా కూట‌మి ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  చేస్తున్న పోరాటాల్లో యువత ముందుండాల‌ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్, తిరుపతి సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి పిలుపునిచ్చారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa