ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పేర్ని నాని వ్యాఖ్యలపై స్పందించిన కొల్లు రవీంద్ర

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 14, 2025, 05:10 PM

మాజీ మంత్రి పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మచిలీపట్నం గొడుగుపేట వేంకటేశ్వరస్వామి దేవస్థానం భూములపై అసత్య ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. దేవుడి భూములను అన్యాక్రాంతం చేస్తున్నారని పేర్ని నాని సంచలన ఆరోపణలు చేశారు. పేర్ని నాని ఆరోపణలను తిప్పికొట్టారు. ఇవాళ (ఆదివారం) మచిలీపట్నం గొడుగుపేట వేంకటేశ్వరస్వామిని మంత్రి కొల్లు రవీంద్ర, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం. భక్తుల సమక్షంలో రూ.45లక్షల లీజు చెక్కు అందజేశారు. చెక్కు అందజేయడంపై భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడారు. గొల్లపూడిలో నేషనల్ హైవే పక్కన 40 ఎకరాల దేవస్థానం భూమిని.. రూ.5కోట్లతో విజయవాడ ఉత్సవ కమిటీ అభివృద్ధి చేస్తోందని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa