ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అసెంబ్లీ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆర్‌జేడీ నేత తేజస్వి యాదవ్

national |  Suryaa Desk  | Published : Sun, Sep 14, 2025, 07:12 PM

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) నేత తేజస్వి యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేసి రాజకీయ వేడిని రాజేశారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లోనూ తమ పార్టీయే పోటీ చేస్తుందని ప్రకటించి మహాఘట్‌బంధన్ కూటమిలో ప్రకంపనలు సృష్టించారు. సీట్ల పంపకాలపై మిత్రపక్షాలతో చర్చలు జరగాల్సి ఉండగా, తేజస్వి చేసిన ఈ ఏకపక్ష ప్రకటన కూటమి భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకునేలా చేసింది.ముజఫర్‌పూర్‌లోని కాంతిలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న తేజస్వి, ఈసారి ప్రజలు తన ముఖం చూసి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్డీఏ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ ఆయన, కేవలం నినాదాలతోనే ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. "బీహార్ నుంచి ఓట్లు, గుజరాత్‌లో ఫ్యాక్టరీలు.. ఈ ఎత్తుగడలు ఇకపై చెల్లవు" అని వ్యాఖ్యానించారు. తమ ఒత్తిడి వల్లే ప్రభుత్వం పెన్షన్, ఉచిత విద్యుత్ వంటి పథకాలను అమలు చేస్తోందని, తాము ముందుంటే ప్రభుత్వం తమను అనుసరిస్తోందని అన్నారు. ఆర్‌జేడీ అధికారంలోకి వస్తే ఉపాధి, అభివృద్ధికి పెద్దపీట వేస్తామని తేజస్వి హామీ ఇచ్చారు. తమ పార్టీ ప్రకటించిన 'మై బెహన్ యోజన'ను కాపీ కొట్టి ప్రభుత్వం మహిళలకు రూ.10,000 ఇస్తోందని, కానీ తాము గెలిస్తే ఐదేళ్లలో ప్రతి మహిళకు లక్షన్నర రూపాయలు అందిస్తామని స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa