ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత ఆటగాళ్లపై అసహనం వ్యక్తం చేసిన షోయబ్ అక్తర్

sports |  Suryaa Desk  | Published : Mon, Sep 15, 2025, 04:23 PM

భారత ఆటగాళ్ల ఈ ప్రవర్తనపై పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. టీమిండియా తీరు తనను తీవ్ర నిరాశకు గురిచేసిందని, ఇది చాలా బాధాకరమని అన్నారు. "ఈ దృశ్యాలు చూసి నేను నిశ్చేష్టుడినయ్యాను. ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు. దయచేసి క్రికెట్ మ్యాచ్‌ను రాజకీయం చేయొద్దు. మేము మీ గురించి మంచి మాటలే చెప్పాం. ఈ షేక్ హ్యాండ్ ఇవ్వని విషయంపై మేం కూడా చాలా మాట్లాడగలం. ఇంట్లో కూడా గొడవలు జరుగుతుంటాయి, వాటిని అక్కడితో వదిలేసి ముందుకు సాగాలి. ఇది క్రికెట్ ఆట, షేక్ హ్యాండ్ ఇచ్చి మీ హుందాతనాన్ని ప్రదర్శించండి" అని అక్తర్ హితవు పలికారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa