ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశ్వబ్రాహ్మణులకు అండగా నిలిచింది జగన్ మాత్రమే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 17, 2025, 04:54 PM

విశ్వబ్రాహ్మణులున గుర్తించిన నాయకుడు వైయస్ జగన్ అని  విశ్వబ్రాహ్మణ కార్పోరేషన్ మాజీ చైర్మన్ తోలేటి శ్రీకాంత్ అన్నారు. అయన మాట్లాడుతూ... మొట్టమొదటిసారి విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్‌ను ఆనాడు స్వర్గీయ వైయస్ఆర్ ఏర్పాటు చేశారు. తండ్రిని మించి తనయుడు వైయస్ జగన్ విశ్వబ్రాహ్మణ కార్పోరేషన్‌ను ఏర్పాటు చేయడం ద్వారా పంచవృత్తుల వారి అభ్యున్నతికి తోడ్పాటును అందించారు. విశ్వకర్మ జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించేలా ఆనాడు సీఎంగా వైయస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయాలకు కూడా దూపదీప నైవేద్యాల కింద ఇచ్చే సాయాన్ని వర్తింప చేశారు. వీరబ్రహ్మేంద్రస్వామి మఠానికి విజయవాడ నుంచి బస్సు సదుపాయం కూడా కల్పించారు. పుష్కరాల సదర్బంగా 2016లో చంద్రబాబు ప్రభుత్వం విశ్వబ్రాహ్మణ సామాజిక భవనంను దుర్మార్గంగా కూల్చివేసింది. వైయస్ జగన్ గారు సీఎం అయిన తరువాత విజయవాడ నడిబొడ్డున కర్మలు, సామాజికభవనాల నిర్మాణానికి స్థలం ఇచ్చిన ఘనత కూడా వైయస్ జగన్ గారికే దక్కుతుంది. ఈ కార్యక్రమంలో గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు అంకంరెడ్డి నాగ నారాయణమూర్తి, వైయస్ఆర్‌సీపీ విద్యార్ధి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్  ఎ.రవిచంద్ర, విశ్వ బ్రాహ్మణ సాధికారిత కమిటీ నేతలు సుబ్రహ్మణ్యం, రజినీ, ఉదయ్ కుమార్, రామారావు, శ్రీమంతుల రామయ్యాచారి, ఇతర విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa